తెలంగాణలో కరోనావైరస్ కొత్త కేసులు 1,378

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:35 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,378  పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1107కి చేరింది.
 
ఆదివారం 1,932 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,87,211కి చేరింది. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,56,431గా వుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,673 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 24,054 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
 
గడిచిన 24 గంటల్లో 35,465మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 28,86,334 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా మరణాల శాతం 0.59గా ఉందని వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments