Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనావైరస్ కొత్త కేసులు 1,378

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:35 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,378  పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1107కి చేరింది.
 
ఆదివారం 1,932 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,87,211కి చేరింది. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,56,431గా వుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,673 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 24,054 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
 
గడిచిన 24 గంటల్లో 35,465మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 28,86,334 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా మరణాల శాతం 0.59గా ఉందని వివరించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments