Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ : 10కె మార్క్‌ను దాటిన పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (14:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపించడమే. తాజాగా ఏపీలో 553 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కరోనా బారిన పడి ఏడుగురు మృత్యువాత పడ్డారు. 
 
రాష్ట్రంలో స్థానికంగా 477 పాజిటివ్‌ కేసులు నమోదు అవగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 69 మందికి పాజిటివ్‌ అని తేలింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. 
 
ఇప్పటి వరకు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,884కు చేరింది. అలాగే దాదాపు 136 మంది మృతి చెందారు. ప్రస్తుతం 5,760 యాక్టివ్‌ కేసులు ఉండగా...కరోనా నుంచి కోలుకుని 4,988 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
ఇకపోతే, జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, అనంతపూరం 1080, చిత్తూరు 699, ఈస్ట్ గోదావరి 824, గుంటూరు 958, కడప 500, కృష్ణ 1179, కర్నూలు 1555, నెల్లూరు 522, ప్రకాశం 218, శ్రీకాకుళం 61, విశాఖపట్టణం 407, విజయనగరం 99, వెస్ట్ గోదావరి 681 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments