Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ : 10కె మార్క్‌ను దాటిన పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (14:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపించడమే. తాజాగా ఏపీలో 553 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కరోనా బారిన పడి ఏడుగురు మృత్యువాత పడ్డారు. 
 
రాష్ట్రంలో స్థానికంగా 477 పాజిటివ్‌ కేసులు నమోదు అవగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 69 మందికి పాజిటివ్‌ అని తేలింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. 
 
ఇప్పటి వరకు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,884కు చేరింది. అలాగే దాదాపు 136 మంది మృతి చెందారు. ప్రస్తుతం 5,760 యాక్టివ్‌ కేసులు ఉండగా...కరోనా నుంచి కోలుకుని 4,988 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
ఇకపోతే, జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, అనంతపూరం 1080, చిత్తూరు 699, ఈస్ట్ గోదావరి 824, గుంటూరు 958, కడప 500, కృష్ణ 1179, కర్నూలు 1555, నెల్లూరు 522, ప్రకాశం 218, శ్రీకాకుళం 61, విశాఖపట్టణం 407, విజయనగరం 99, వెస్ట్ గోదావరి 681 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments