ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి..

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (20:02 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 10,171 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,04,065కి చేరింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 84,654 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 7,594 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తంగా 1,17,569 మంది కోలుకున్నారు. 
 
గత 24 గంటల్లో 62,938 నమూనాలు, ఇప్పటి వరకు 23,62,270 నమూనాలు పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది. తాజాగా 89 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 1842కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

KajaL Agarwal: ఎప్పటికీ అంతం కాని బంధంగా కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు

Samantha: రాజ్ నిడిమోరు విజయవంతమైన దర్శకుడే కాదు, భర్త కూడా!

Mahesh Babu :మహేష్ బాబు 1: నేనొక్కడినే 4K ఫార్మెట్ లో వారణాసిలో ముందస్తు షోలు

కలెక్షన్ నంబర్లలో ఒక చిత్ర విజయాన్ని నిర్ణయించలేం : రామ్ చరణ్

ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

తర్వాతి కథనం
Show comments