ఏపీలో కరోనా విజృంభణ.. 20వేలకు పైగా కేసులు 99మంది మృతి

Webdunia
మంగళవారం, 18 మే 2021 (20:18 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మంగళవారం 20 వేలపైనే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,253 నమూనాలను పరీక్షించగా 21,320 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 14,75,372 కి చేరింది. 24 గంటల్లో కరోనాతో 99 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో 9,580 మంది మృతి చెందారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,501 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 12,54,291 మంది రికవరీ అయ్యారు. ఇక కొత్తగా చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో పది మంది చొప్పున కరోనాతో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు. 
 
అంతేకాకుండా అనంతపురం, గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు చొప్పున, నెల్లూరు ఐదుగురు, కడప ఇద్దరు కరోనాతో మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments