Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వారం రోజులు ఆస్పత్రిలోనే అమితాబ్ బచ్చన్, అభిషేక్..

Webdunia
బుధవారం, 15 జులై 2020 (10:52 IST)
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకుంటున్నారు. బిగ్ బి, ఆయన తనయుడు అభిషేక్‌ కరోనా పాజిటివ్‌తో ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బిగ్ బి కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యలకు కూడా పాజిటివ్‌ వచ్చినా, ఇద్దరూ ఇంటి వద్దే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. 
 
అమితాబ్, అభిషేక్‌ చికిత్సకు చక్కగా సహకరిస్తున్నారని, ఇద్దరు కోలుకుంటున్నారని, మరో వారం రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు పేర్కొన్నారు. కాగా బిగ్‌ బి కుటుంబం త్వరగా కోలుకోవాలని పలువురు సినిమా తారలు, అభిమానులు పూజలు చేస్తున్నారు. 
 
మరోవైపు బిగ్ భార్య జయాబచ్చన్‌కు నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కూడా హోం ఐసోలేషన్లో వున్నారు. అమితాబ్ వయసు 77 ఏళ్లు. కరోనా లక్షణాలు తొలి దశలోనే ఉన్నా, ఈ వయసులో రిస్క్ తీసుకోవడం ఎందుకని భావించి నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అమితాబ్‌కి వయసు మీద పడినా యాక్టివ్‌గా వున్నారని, కరోనా లక్షణాలు తక్కువగా వున్నా ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలోనే చేరి బిగ్ బి అమితాబ్ చికిత్స పొందుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో అమితాబ్ సినిమా కార్మికులకు ఎంతో సాయం చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments