Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కరోనా కేసుల లెక్కలన్నీ తప్పుడు లెక్కలు, ఎవరు?: మాస్కులేవీ? హైకోర్టు

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (14:18 IST)
తెలంగాణ కరోనా కేసుల ఉధృతి లేనేలేదు. అస్సలు నైట్ కర్ఫ్యూ అవసరంలేదు అని ప్రభుత్వం చెపుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుందని ఇవాళ తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు.

 
ఫీవర్ సర్వేలో ఏకంగా మూడంటే మూడు రోజుల్లో లక్షా 70 వేల మంది బాధితులను గుర్తిస్తే... రోజువారీ చెక్ చేస్తే ఇంకా ఎంతమంది వుంటారో తెలుస్తుందన్నారు. తెలంగాణలో కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం సమర్పిస్తున్న లెక్కలన్నీ తప్పుడు లెక్కలని, పైగా ప్రభుత్వ కిట్లో పిల్లలకు అవసరమైన మందులు అస్సలు కనబడటంలేదని పిటీషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు. ఐతే పిటిషనర్ల తరపున న్యాయవాదులు చేసిన వాదలను తోసిపుచ్చిన ప్రభుత్వం, కరోనా విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 
ఇరువురి వాదనలను విన్న హైకోర్టు... రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో పౌరులు మాస్కులు లేకుండా బయట తిరగాడన్ని ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. భౌతిక దూరం కూడా పాటించకపోవడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించిన కోర్టు, జిహెచ్ఎంసి, పోలీసులు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు జరిగేట్లు చూడాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments