Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ నుంచి భారత్‌కు చేరుకున్న 49 మంది ప్రవాసులు..

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (16:50 IST)
కరోనా నేపథ్యంలో యూఏఈలో చిక్కుకున్న 49 మంది ప్రవాసులు ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పొట్టకూటి కోసం సుమారు 49 మంది భారతీయులు కొద్ది సంవత్సరాల క్రితం యూఏఈ వెళ్లారు. అక్కడ ఇండియాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన పరిశ్రమలలో పనికి కుదిరారు. 
 
అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ మొదలైన తొలినాళ్లలో.. ఈ 49 మంది పని చేస్తున్న పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఉపాధి లేక వాళ్లు రోడ్డునపడ్డారు. ఈ క్రమంలో సదరు కార్మికులు తమ సమస్యలను యూఏఈలోని ఇండియన్ మిషన్‌కు వివరించారు. 
 
దీంతో స్పందించిన ఇండియన్ మిషన్.. వారికి అండగా నిలిచింది. జూలై నుంచి వారి యోగక్షేమాలు చూసుకుంది. అంతేకాకుండా వారి ఇబ్బందులను యూఏఈలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఇండియన్ కాన్సులేట్ అధికారులు రంగంలోకి దిగారు. 
 
దుబాయి పోలీసుల సహాయంతో సదరు కార్మికుల యజమానులను సంప్రదించారు. అంతేకాకుండా ఆ 49 మంది కార్మికులను.. విడతల వారీగా స్వదేశానికి తరలించడం కోసం ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో యూఏఈలో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments