Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుకులాల్లో కలకలం రేపుతున్న కరోనా - 42 మందికి పాజిటివ్

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా, విద్యార్థుల వసతి గృహాల్లో ఈ వైరస్ విజృంభిస్తుంది. తాజాగా మరో 42 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. 
 
సంగారెడ్డి జిల్లా ముత్తంగి మహాత్మా జ్యోతిరావు పూలే ఇంటర్ కాలేజీకి చెందిన అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. మొత్తం 42 మంది విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయుడు కూడా ఈ వైరస్ బారినపడ్డారు. 
 
ఈ కాలేజీలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 261 మంది విద్యార్థులకు 27 మంది సిబ్బందికి ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ పరీక్షల్లో 42 మంది విద్యార్థులకు, ఓ టీచర్‌కు పాజిటివ్ అని వచ్చింది. దీంతో మిగిలిన విద్యార్థులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన విద్యార్థులందరినీ హౌం ఐసోలేషన్‌లో ఉంచారు. వీరందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు జిల్లా ఆరోగ్య శాఖ అధికారి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments