Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎయిమ్స్‌లో 30 మంది వైద్యులు, నర్సులు క్వారంటైన్‌కు...

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (11:17 IST)
ఢిల్లీ ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో సెంటర్‌లో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కలిపి 30 మందిని క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. రెండు రోజుల కిందట బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలతో 72 ఏళ్ల వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయనకు సీటీ, ఎంఆర్‌ఐ వంటి పరీక్షలు నిర్వహించి, న్యూరాలజీ వార్డులో ఇతర రోగులతో పాటు ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
ఉన్నట్టుండి ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఛాతీ ఎక్స్‌-రే తీసి, వెంటిలేటర్‌ అమర్చారు. ఆయన నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపగా ఆయనకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు, నర్సులు, పరీక్షలు నిర్వహించిన టెక్నీషియన్లు క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. 
 
మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో హాట్‌ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలను ఈనెల 30 వరకు పూర్తిగా దిగ్బంధించాలని ఆ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. హోం డెలివరీని మాత్రమే అనుమతిస్తారు. ఆగ్రా, లక్నో, గౌతమ్‌ బుద్ధ నగర్‌, కాన్పూర్‌, వారాణసి, షామిల్‌, మీరట్‌, బరేలీ, బులంద్‌షహర్‌ తదితర జిల్లాల్లో కొవిడ్‌-19 బాధితులు ఎక్కువగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments