Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశా: 26 మందికి పైగా టీచర్లు, విద్యార్థులకు కరోనా

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (20:42 IST)
కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాలలు ఒడిశాలో జనవరి 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. కానీ కేవలం మూడు రోజుల వ్యవధిలో 30 మందికిపైగా టీచర్లు, విద్యార్థులు కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలోని గజపతి జిల్లాలో గత మూడు రోజుల్లో కొత్తగా 31 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు. అందులో 90 శాతం మంది ఉపాధ్యాయులు, విద్యార్థులే ఉన్నారన్నారు. స్కూళ్లకు వెళ్లడంతో వీరికి కరోనా వైరస్‌ సోకిందని చెప్పారు.
 
ఒడిశాలో 10, 12వ తరగతి విద్యార్థులకు శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే విద్యా సంస్థల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఇద్దరు విద్యార్థులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. 
 
కాగా, బోర్డు పరీక్షల దృష్ట్యా నిరాటంకంగా వంద రోజులపాటు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈనేపథ్యంలో తల్లిదండ్రుల అనుమతితో తగిన జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులు తరగతులకు హాజరుకాలని ప్రభుత్వం సూచించింది. కాగా, రాష్ట్రంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో ఈరోజునుంచి చివరి సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభమయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments