Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి సంతాప విందు ఫలితం .... 26 వేల మందికి హోం క్వారంటైన్

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (10:47 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన తల్లి మృతికి సంతాపంగా ఇచ్చిన విందుకు హాజరైన 26 వేల మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. నిజానికి ఈ సంతాప విందుకు 1200 మంది హాజరయ్యారు. కానీ, 26 వేల మందిని హోంక్వారంటైన్‌కు తరలించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురేనా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. ఈయన తల్లి ఇటీవల చనిపోయింది. దీంతో మార్చి 17వ తేదీన దుబాయి నుంచి సొంతూరుకు వచ్చాడు. ఆ తర్వాత అంటే మార్చి 20వ తేదీన తమ సంప్రదాయం ప్రకారం తల్లి మృతికి సంతాపంగా విందు ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు అందరూ కలిసి దాదాపు 1200 మంది వరకు హాజరయ్యారు. 
 
ఇంతవరకు బాగానేవుంది... మార్చి 27వ తేదీన విందు ఇచ్చిన వ్యక్తితో పాటు.. అతని భార్యలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు... అతనివద్ద వివరాలు సేకరించగా, అసలు విషయం బహిర్గతమైంది. 
 
తాను దుబాయ్ నుంచి వచ్చినట్టు చెప్పాడు. వీరిద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు ఈ నెల 2న తేలింది. విందులో పాల్గొన్న మరో 10 మందికి కూడా కరోనా వైరస్ సోకినట్టు మూడో తేదీన నిర్ధారణ అయింది. దీంతో విందుకు హాజరైన, వారితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 26,000 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments