Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల ఆందోళన.. ఐద్దరు ఢిల్లీ ఐపీఎస్ అధికారులకు కరోనా..

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (11:11 IST)
దేశ రాజధాని సరిహద్దులో రైతుల ఆందోళన వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు కరోనా సోకడం తాజాగా కలకలం రేపింది. ఢిల్లీ-హర్యానా మార్గంలోని సింఘు సరిహద్దు వద్ద పోలీసు బలగాలకు నేతృత్వం వహిస్తున్న డీసీపీ, అదనపు డీసీపీకి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వారిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. 
 
నిరసన చేస్తున్న రైతులు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం, చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వైరస్‌ వేగంగా వ్యాపించే ముప్పు ఉందని ఇప్పటికే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజా కేసులు కలవరపెడుతున్నాయి. 
 
మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన శివారుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 16వ రోజుకు చేరింది. తీవ్రమైన చలిని కూడా లెక్కచేయకుండా సింఘు, టిక్రీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు బైఠాయించి తమ నిరసన సాగిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పహారా కూడా కొనసాగుతోంది. కాగా.. ఆందోళన చేస్తున్న రైతులకు కొన్ని ఎన్జీవోలు కొవిడ్‌ పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments