Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల ఆందోళన.. ఐద్దరు ఢిల్లీ ఐపీఎస్ అధికారులకు కరోనా..

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (11:11 IST)
దేశ రాజధాని సరిహద్దులో రైతుల ఆందోళన వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు కరోనా సోకడం తాజాగా కలకలం రేపింది. ఢిల్లీ-హర్యానా మార్గంలోని సింఘు సరిహద్దు వద్ద పోలీసు బలగాలకు నేతృత్వం వహిస్తున్న డీసీపీ, అదనపు డీసీపీకి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వారిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. 
 
నిరసన చేస్తున్న రైతులు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం, చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వైరస్‌ వేగంగా వ్యాపించే ముప్పు ఉందని ఇప్పటికే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజా కేసులు కలవరపెడుతున్నాయి. 
 
మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన శివారుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 16వ రోజుకు చేరింది. తీవ్రమైన చలిని కూడా లెక్కచేయకుండా సింఘు, టిక్రీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు బైఠాయించి తమ నిరసన సాగిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పహారా కూడా కొనసాగుతోంది. కాగా.. ఆందోళన చేస్తున్న రైతులకు కొన్ని ఎన్జీవోలు కొవిడ్‌ పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments