Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ సచివాలయంపై కరోనా పంజా.. వణికిపోతున్న ఉద్యోగులు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (19:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంపై మరోమారు కరోనా వైరస్ పంజా విసిరింది. తాజాగా 14 మంది ఉద్యోగులకు ఈ వైరస్ సోకింది. ఇపుడు వీరితో కాంటాక్ట్ అయినవారు భయంతో వణికిపోతున్నారు. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారంతా టెస్టులు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. మరోవైపు సచివాలయాన్ని శానిటైజ్ చేశారు. ఇంకోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు దాదాపు 10 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. 
 
మరోవైపు, తెలంగాణలో కొవిడ్-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,018 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అదేసమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688 కి చేరింది. ఆస్పత్రుల్లో 25,685 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 85,223 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 780కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 475 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 32 లక్షల మార్కును క్రాస్ చేసింది. గత 24 గంటల్లో 67,151 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 1,059 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 32,34,475 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 59,449కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 24,67,759 మంది కోలుకున్నారు. 7,07,267 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments