Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్లల మామిడాడలో కరోనా పంజా... 125కి చేరిన కేసులు

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (09:29 IST)
గొల్లల మామిడాడలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో  గ్రామంలోనే 119 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ గ్రామం ఉన్న పెదపూడి మండలంలో మొత్తం కేసుల సంఖ్య 125కి చేరింది. మే 21న మామిడాడలో గుర్తించిన కేసు ద్వారానే రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో 57 మంది కూడా వైరస్‌ బారిన పడ్డారు.
 
అలాగే  పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. జిల్లాలో కొత్తగా 64 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 589కి చేరింది. ఏలూరు సిటీ, రూరల్ పరిధిలో కొత్తగా 22 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ రెండు ప్రాంతాలలో పాజిటివ్ కేసులు 199కి చేరాయి. నరసాపురం, మొగల్తూరు తీరు పై ప్రాంతాన్ని కోవిడ్ కేసులు వణికిస్తున్నాయి. 
 
జిల్లా వ్యాప్తంగా కొత్తగా తొమ్మిది కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ప్రస్తుతం ఉన్న క్వారంటైన్ సెంటర్‌ను వంద పడకలతో కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ఏలూరు సీఆర్‌ఆర్ మహిళా కాలేజీలో వంద పడకలతో మరో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments