క్యాలీఫ్లవర్‌ను ఉడికించే నీళ్ళలో పాలను చేర్చితే?

క్యాలీఫ్లవర్‌ను ఉడికించే నీళ్ళలో కాసిని పాలు చేర్చితే రంగు మారకుండా ఉంటుంది. అరటి చిప్స్‌ని వేయించేటప్పుడు ఉప్పు నీళ్ళు చిలకరించి వేయిస్తే కరకరలాడతాయి. లడ్డూలని అర నిమిషం మైక్రో ఓవెన్ లో ఉంచి తీస్తే త

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (13:48 IST)
క్యాలీఫ్లవర్‌ను ఉడికించే నీళ్ళలో కాసిని పాలు చేర్చితే రంగు మారకుండా ఉంటుంది. అరటి చిప్స్‌ని వేయించేటప్పుడు ఉప్పు నీళ్ళు చిలకరించి వేయిస్తే కరకరలాడతాయి. లడ్డూలని అర నిమిషం మైక్రో ఓవెన్ లో ఉంచి తీస్తే తాజాగా వుంటాయి. బియ్యాన్ని నిల్వ ఉంచేటప్పుడు ఎండిన పుదీనా ఆకులని మెత్తని పొడిగా చేసి కలిపితే పురుగు పట్టకుండా చక్కని సువాసనతో ఉంటాయి.
 
ఓవెన్‌ను శుభ్రపరిచేప్పుడు లోపల వంటసోడా చల్లి రాత్రంతా మూత పెట్టి ఉంచాలి. ఉదయమే ఉప్పు, నిమ్మరసం సమానంగా కలిపి దానిలో ముంచిన స్పాంజితో తుడిస్తే దుర్వాసన పోతుంది. పచ్చి బఠాణీలు నిల్వ ఉండాలంటే వాటిని పాలిథీన్ సంచిలో వేసి డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. పాలు కాచే పాత్రకి అడుగున కొద్దిగా నెయ్యి రాస్తే దానిని శుభ్రపరచడం తేలిక అవుతుంది. 
 
మిఠాయిల తయారీకి పంచదార పొడి చేస్తుంటే, నాలుగు బియ్యం గింజల్ని కూడా కలపండి. పొడి ఉండకట్టకుండా ఉంటుంది. కొన్ని రకాల కేక్‌లు, బిస్కట్ల తయారీలో వాడే హేజల్ నట్స్ దొరకనప్పుడు కప్పు బాదం పలుకులు వేసుకోవచ్చు. రుచిలో తేడా వుండదు. 
 
కూరగాయలు ఉడికించాక రంగు కోల్పోకుండా ఉండాలంటే నీళ్ళలో చిటికెడు పసుపు, చెంచా ఆలివ్ నూనె జోడిస్తే సరిపోతుంది. బియ్యాన్ని మిక్సీ పట్టేటప్పుడు అందులో చెంచా పంచదార కలిపితే బియ్యం పిండి తెల్లగా వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చెరకు పంట కోసం కడుపు పంటను తొలగించుకుంటున్న మహిళలు, ఎందుకీ పరిస్థితి?

చికెన్ పులావ్ తర్వాత పుచ్చకాయ తిన్నారు.. అంతే దంపతులు, ఇద్దరు కుమార్తెల మృతి

బీఆర్ఎస్ పార్టీ చనిపోయింది.. శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి రాదు : సీఎం రేవంత్ రెడ్డి

22 నిమిషాల్లో ఉగ్రవాదుల కమాండ్ వ్యవస్థను కుప్పకూల్చాం : ఇండియన్ ఆర్మీ

కుమారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్.. జరిమానాలతో విసిగిపోయి మోటార్‌ సైకిల్‌కు నిప్పంటించాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఊసరవెల్లి 4K విడుదలలో బెంగుళూరు, తిరుపతిలో కార్యక్రమాలు

Chiranjeevi: చిరంజీవి, బాబీ సినిమా కోసం నిర్మాత మార్పు ?

Kajal: రసాయనాల దుర్వినియోగం నేపథ్యంగా కాజల్ అగర్వాల్.. ది ఇండియా స్టోరీ

ఇందులో ప్రభాస్, మహేష్ బాబు, సిద్ధార్థ, యష్, అర్జున్ రెడ్డిని కూడా వున్నారు : దిల్ రాజు

లయతో Jagapatibabu: నా ప్రయాణం మనోహరం టు వడలతో ప్రారంభమైంది: జగపతి బాబు

తర్వాతి కథనం
Show comments