వంటింటి చిట్కాలు: ఆకుకూరతో వేరుశెనగల్ని చేర్చి ఉడికిస్తే?

వంటనూనెలో రెండు మూడు మిరపకాయ వడియాలను వేసివుంచితే చాలారోజుల వరకు చెడకుండా వుంటుంది. రసం తయారించేటప్పుడు కొబ్బరి నీటితో కాస్త చేర్చుకుంటే.. రసం రుచిగా వుంటుంది. బజ్జీలు చేసేందుకు కట్ చేసి పెట్టుకున్న అ

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (13:51 IST)
వంటనూనెలో రెండు మూడు మిరపకాయ వడియాలను వేసివుంచితే చాలారోజుల వరకు చెడకుండా వుంటుంది. రసం తయారించేటప్పుడు కొబ్బరి నీటితో కాస్త చేర్చుకుంటే.. రసం రుచిగా వుంటుంది.

బజ్జీలు చేసేందుకు కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు, బంగాళాదుంపల ముక్కలకు ఉప్పు, కారం పట్టించి.. అర్ధ గంట తర్వాత బజ్జీ పిండితో ముంచి.. నూనెలో వేపుకుంటే బజ్జీలు రుచిగా వుంటాయి.
 
వేపుళ్లు లేదా ఉప్మాల్లో కారం అధికమైతే రస్క్ లేదా బ్రెడ్ పొడిని చల్లితే సరిపోతుంది. ఎండని వేరు శెనగలను ఆకుకూరలతో కలిపి ఉడికించి రుబ్బుకుంటే ఆకుకూర టేస్ట్ అదిరిపోతుంది. బియ్యం ముప్పావు వంతు వేరుశెనగలు పావు వంతు చేర్చుకుని రుబ్బుకుని దోసెలు పోసుకుంటే రుచిగా వుంటాయి. 
 
ఉలవలతో టమోటా, ఉల్లిపాయలు, మిరపకాయలు చేర్చి ఉడికించి పప్పు చారు చేస్తే రుచి బాగుంటుంది. చపాతీలు మృదువుగా రావాలంటే.. ఉడికించిన బంగాళాదుంపల్ని గోధుమ పిండితో కలిపితే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హస్తినలో సీఎం బాబు ... వైజాగ్ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం

సముద్రంలో పడవ బోల్తా, 53 మంది జల సమాధి

తిరుమల కల్తీ లడ్డూ కేసు : రూ.234 కోట్ల హవాలా మోసం... రంగంలోకి ఈడీ

చంద్రబాబును కలవడం గొప్ప అనుభూతి - ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి...

సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారాడు... ఏం ఫీల్ వుంది మావ ఇక్కడ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్ర నిర్మాతకు మద్రాస్ హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్

Santosh Shobhan: కపుల్ ఫ్రెండ్లీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ : ధీరజ్ మొగిలినేని

Tanikella Bharani: శివ భక్తితో లీనమై శివోహం పాటలో నటించా : తనికెళ్ల భరణి

జీవితంలో అందరికీ కనెక్ట్ అయ్యే సీన్స్ ఫంకీ లో ఉంటాయి : కె.వి. అనుదీప్

Prabhas: ఫౌజీ షూటింగ్‌పై కీలక అప్డేట్ - ప్రభాస్ రెడీ ఫర్ యాక్షన్ ?

తర్వాతి కథనం
Show comments