చేపల వాసన పోవాలంటే.. ఇలా చేయండి..

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (15:23 IST)
పసిపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సాంబ్రాణి పొగ వేయడం సహజం. ఇలా చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వర్షాకాలంలో అయితే ప్రతి ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడం మంచిది. ఇంట్లో దుర్వాసనలు, క్రిమికీటకాలు సాంబ్రాణి పొగతో దూరమవుతాయి. సాంబ్రాణితో ఇల్లంతా మంచి సువాసనను సంతరించుకుంటుంది. కర్పూరాన్ని కూడా ఇలాంటి ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. 
 
కర్పూరాన్ని వెలిగిస్తే సువాసన కాసేపు మాత్రమే ఉంటుంది. కానీ అలా చేయకుండా ఆరు కర్పూరం బిళ్లలను తీసుకుని అందులో అగరొత్తుల పొడి కలిపి ఇంట్లో లేదా స్నానాల గదిలో ఉంచి చూడండి. ఫలితం మీకే కనబడుతుంది. వాసన ఎక్కువ సేపు ఉంటుంది. పైగా కర్పూర పరిమళానికి ఈగలు కూడా దరిచేరవు. ఇంకా నిమ్మ, లావెండర్‌, దాల్చిన చెక్క నూనెలు బయట అమ్ముతారు. 
 
ఇవి ఇంట్లో పరిమళాలను వెదజల్లడంతోపాటు ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి. వీటిలో దూదిని ముంచి ఓ గదిలో పక్కన పెడితే చాలు, ఇల్లంతా సువాసనతో నిండిపోతుంది. అలాగే రంధ్రాలున్న చిన్న గిన్నె తీసుకుని అందులో కొన్ని కాఫీ గింజల్ని నింపి మూత పెట్టాలి.
 
ఈ గిన్నెను వంటింట్లో ఓ మూలన ఉంచాలి. కాఫీ గింజలు ఇతర దుర్వాసనల్ని పీల్చుకుని వాటి వాసనల్ని వెదజల్లుతుంటాయి. మసాలా వాసన, చేపల వాసన పోవాలంటే, స్ప్రే సీసాలో వెనిగర్‌ని తీసుకుని వంటిల్లూ, ఇతర గదుల్లో చల్లి చూస్తే మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments