Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరంమసాలా సువాసనలతో "దహీ మచ్చీ"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
చేప ముక్కలు.. 300 గ్రా.
పెరుగు.. ఒక కప్పు
ఉల్లిపాయ.. ఒకటి
అల్లంవెల్లుల్లి పేస్ట్.. అర టీ.
పచ్చిమిరపకాయలు.. 3
బే ఆకులు.. 2
గరంమసాలా.. అర టీ.
నూనె.. రెండు టీ.
నిమ్మరసం.. ఒక టీ.
కొత్తిమీర.. ఒక టీ.
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
చేప ముక్కలపై ఉప్పు, నిమ్మరసం వేసి కొద్ది నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తర్వాత బాగా కడగాలి. పెరుగు, ఉప్పు తేలికగా గిలకొట్టి దాన్ని చేప ముక్కల్లో వేసి బాగా కలియబెట్టి అరగంటసేపు నానబెట్టాలి. మూకుడులో నూనె వేడిచేసి బే ఆకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించాలి.

ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు కలిపి కాసేపు ఉడికించాలి. ఆపై పెరుగులో నానబెట్టి ఉంచిన చేప ముక్కలు వేసి కలియబెట్టి గరంమసాలా, ఉప్పు కలిపి మూతపెట్టి ఉడికించాలి. ముక్క ఉడికిన తరువాత చివర్లో కొత్తిమీరతో అలంకరించి దించేసి సర్వ్ చేయాలి. అంతే నోరూరించే దహీ మచ్చీ రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments