పిల్లలు ఇష్టంగా తినాలంటే ఏం చేయాలో తెలుసుకోండి

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2015 (18:20 IST)
పిల్లలు కడుపు నిండా తినాలని ఆరాటపడుతుంటారు. ఆకలి మందగించిందా లేదా అని గమనించి, అందుకు తగ్గట్లు ఆహార అలవాట్లను మార్చాలి. ఇంకా పిల్లలు ఇష్టపడి తినాలంటే.. ఆకలి పెంచే క్రమంలో ఉదయాన్నే తీసుకునే అల్పాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. ముఖ్యంగా తృణధాన్యాలూ, పెరుగూ, పండ్ల వంటి వాటిలో చేసిన వివిధ పదార్థాలను ఎంచుకుని వారికి అందించాలి. ఇవి శరీరానికి తగిన పోషకాలను అందిస్తూనే ఆకలిని పెంచుతాయి. 
 
చిన్నారులకు ఆహారాన్ని అందించే వేళల్ని క్రమబద్ధం చేసుకోండి. మీ పని పూర్తవడాన్ని బట్టో లేక ఓ పనైపోతోందనో భావించి చేయొద్దు. ఇలాంటప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టేయడం వల్ల వారికి అన్నం తినడం మీద ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది. జీర్ణశక్తి మందగిస్తుంది. అందుకే కొద్ది కొద్దిగా అన్నం తినేలా చూడండి. 
 
చిరుతిండిని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. అవే తినాలని నిబంధన పెట్టకూడదు. వారి ఇష్టానికి అనుగుణంగా ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్ ఇవ్వండి. అవసరమైనప్పుడు పండ్లు, నట్స్, క్రీమ్ చీజ్, పాప్ కార్న్ వంటివి ఎదిగే పిల్లలకు అవసరమని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

Show comments