Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత కోసం శ్రీ గురురాఘవేంద్ర సన్నిధిలో డాక్టర్ సునీల్ ప్రత్యేక పూజలు

గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా అస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ ఉంగలుక్కాగ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సునీల్ స్థానిక

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (15:53 IST)
గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా అస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ ఉంగలుక్కాగ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సునీల్ స్థానిక టీ నగర్‌లోని గురు రాఘవేంద్ర సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు వెయ్యి మందికి అన్నదానం చేశారు. 
 
ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ మాట్లాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని కోరుకున్నారు. అంతేకాకుండా, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ఉండాలని, తమిళనాడు రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచేలా పాలన సాగించాలని, ఇందుకోసం అమ్మకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీగురు రాఘవేంద్ర స్వామిని వేడుకున్నట్టు తెలిపారు. 
 
కాగా, ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్‌తో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ చక్రవర్తి ఆవుల, ఆస్కా కమిటీ సభ్యులు దువ్వూరు సురేష్ రెడ్డి, కోడై చంద్ర, అంబేద్కర్  జననాయక పేరవై కార్యదర్శి జి ప్రభాకర్, ఆడిటర్ రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments