Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌కో సిమెంట్స్ కర్మాగారంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు...

Webdunia
ఆదివారం, 23 మే 2021 (21:59 IST)
విరుదునగర్ జిల్లాలోని రామస్వామి రాజా నగర్‌లోని రామ్‌కో సిమెంట్స్ కర్మాగారంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పారు. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే ప్రాణవాయువును జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయనున్నారు. 
 
ఈ ప్లాంట్‌ను ప్రజా సంక్షేమం, ప్రజా వినియోగార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రాణవాయును రాజపాళెయం, విరుదునగర్, శివకాశి, అరుబ్బుకోట్టై, సాత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు.
 
ఈ ప్లాంట్‌ను రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ సమక్షంలో ఈ ప్లాంట్‌ను విరుదునగర్ జిల్లా కలెక్టర్ ఆర్.కణ్ణన్ ప్రారంభించారు. రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా రోజుకు... 45 లీటర్ ద్రవ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయనుంది. 
 
ఇది వాయు రూపంలో 7 వేల లీటర్ల ప్రాణవాయుకు సమానం. నిమిషానికి 10 లీటర్ల చొప్పున ఒక ఆక్సిజన్ సిలిండర్‌ను ఒక రోగికి 10 నుంచి 12 గంటల పాటు ఉపయోగించవచ్చు. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే మెడికల్ ఆక్సిజన్ ద్వారా ఒక రోజుకు 24 ప్రాణాలను రక్షించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments