Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. చెన్నైలో తెలుగు టెక్కీ దుర్మరణం

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (09:37 IST)
చెన్నైలో ఇద్దరు టెక్కీలు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరు తెలుగు టెక్కీ కాగా మరొకరు కేరళ రాష్ట్రానికి చెందిన యువతిగా గుర్తించారు. ఈ ఇద్దరినీ కారు రూపంలో మృత్యువు బలితీసుకుంది. రోడ్డు దాటుతుండగా అమిత వేగంతో వచ్చిన కారు ఒకటి వారిని ఢీకొట్టింది. దీంతో వారు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతికి చెందిన ఎస్.లావణ్య (24), కేరళకు చెందిన ఆర్. శ్రీలక్ష్మి (23)లు చెన్నైలోన ఓఎంఆర్ రోడ్డులో ఉన్న ఓ ఐటీ కంపెనీలో టెక్కీలు పని చేస్తున్నారు. వీరిద్దరూ బుధవారం రాత్రి తమ కార్యాలయం పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరారు. 
 
వీరు రోడ్డు దాటుతుండగా, వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక యువతి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, మరో యువతి మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments