Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడిని చంపి శవంతో సెల్ఫీ... వాట్సప్‌లో షేర్...

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (17:56 IST)
గంజాయి దమ్ము బిగించి కొడితే... అనే పాటలో మాదిరిగా ఇద్దరు స్నేహితులు మత్తు పదార్థం గంజాయి మత్తులో కొట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరిలో ఒకడు రాక్షసుడిగా మారిపోయి తన స్నేహితుడిని అత్యంత దారుణంగా మద్యం సీసాతో గొంత కోసి ఆ తర్వాత పొడిచేశాడు. ఇంకా కసి తీరక అతడి ముఖాన్ని ఛిద్రం చేశాడు. ఆ తర్వాత అతడి శవంతో సెల్ఫీ దిగి తన మిగిలిన స్నేహితులకు షేర్ చేసేశాడు. 
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని సెయింట్ థామస్ మౌంట్ పోలీసు స్టేషనుకి కూత వేటు దూరంలో ముగ్గురు యువకులు గంజాయి సేవించారు. ఈ క్రమంలో ఏదో విషయం దగ్గర కార్తీక్, కుబేష్ మధ్య వాదన జరిగింది. అసలే గంజాయి మత్తులో వుండటంతో అతడు మరింత ఆగ్రహావేశానికి గురై దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతడి శవంతో కార్తీక్ సెల్ఫీ దిగి శవాన్ని అక్కడో గోతిలో పూడ్చి పెట్టేశాడు. ఇతడికి మరో స్నేహితుడు కూడా సాయం చేశాడు. 
 
ఐతే వెళ్లేటప్పుడు ముగ్గురు వెళ్లి వచ్చేటపుడు ఇద్దరే రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి  పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో గొయ్యి తవ్వినట్లు ఆనవాళ్లు కనిపించడంతో అక్కడ తవ్వి చూడగా యువకుడి శవం లభించింది. మరోవైపు వాట్సప్‌లో షేర్ అయిన ఫోటోలు కూడా పోలీసుల దృష్టికి రావడంతో నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments