Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడిని చంపి శవంతో సెల్ఫీ... వాట్సప్‌లో షేర్...

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (17:56 IST)
గంజాయి దమ్ము బిగించి కొడితే... అనే పాటలో మాదిరిగా ఇద్దరు స్నేహితులు మత్తు పదార్థం గంజాయి మత్తులో కొట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరిలో ఒకడు రాక్షసుడిగా మారిపోయి తన స్నేహితుడిని అత్యంత దారుణంగా మద్యం సీసాతో గొంత కోసి ఆ తర్వాత పొడిచేశాడు. ఇంకా కసి తీరక అతడి ముఖాన్ని ఛిద్రం చేశాడు. ఆ తర్వాత అతడి శవంతో సెల్ఫీ దిగి తన మిగిలిన స్నేహితులకు షేర్ చేసేశాడు. 
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని సెయింట్ థామస్ మౌంట్ పోలీసు స్టేషనుకి కూత వేటు దూరంలో ముగ్గురు యువకులు గంజాయి సేవించారు. ఈ క్రమంలో ఏదో విషయం దగ్గర కార్తీక్, కుబేష్ మధ్య వాదన జరిగింది. అసలే గంజాయి మత్తులో వుండటంతో అతడు మరింత ఆగ్రహావేశానికి గురై దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతడి శవంతో కార్తీక్ సెల్ఫీ దిగి శవాన్ని అక్కడో గోతిలో పూడ్చి పెట్టేశాడు. ఇతడికి మరో స్నేహితుడు కూడా సాయం చేశాడు. 
 
ఐతే వెళ్లేటప్పుడు ముగ్గురు వెళ్లి వచ్చేటపుడు ఇద్దరే రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి  పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో గొయ్యి తవ్వినట్లు ఆనవాళ్లు కనిపించడంతో అక్కడ తవ్వి చూడగా యువకుడి శవం లభించింది. మరోవైపు వాట్సప్‌లో షేర్ అయిన ఫోటోలు కూడా పోలీసుల దృష్టికి రావడంతో నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments