Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై రాజ్యలక్ష్మి వైద్య కాలేజీ హాస్పిటల్ ఆస్పత్రి ఉచిత వైద్య శిబిరం..

ఠాగూర్
చెన్నై నగరంలో ఉన్న ప్రముఖ వైద్య కాలేజీల్లో రాజ్యలక్ష్మి వైద్య కాలేజీ ఆస్పత్రి ఒకటి. ఈ వైద్యకాలేజీ, ఆస్పత్రికి చెందిన విద్యార్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నగరిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నగరి పట్టణంలోని సీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ వైద్య శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థులతో కలిసి అనేక మంది స్థానికులు కూడా స్వచ్చంధంగా తరలివచ్చి వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ముఖ్యంగా, రక్తపోటు, షుగర్, స్త్రీ సంబంధిత వ్యాధులు, ఎముకలు, ఈఎన్టీ, సాధారణ వైద్య పరీక్షలన్నీ నిర్వహించారు.
 
21 మంది వైద్యులు, సుమారు 500 మంది రోగులను పరీక్షించి వివిధ రకాలైన మందులను ఉచితంగా ఉందజేశారు. ఇందులో యూనియన్ బ్యాంకు రీజినల్ హెడ్ రామ్ ప్రసాద్, నగరి బ్రాంచ్ మేనేజర్ యువరాజ్, ఏఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరానికి నగరి మున్సిపాలిటీకి చెందిన ప్రజలు మాత్రమే కాకుండా నగరి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు తీసుకున్నారు. ఈ వైద్య శిబిరాన్ని రాజ్యలక్ష్మి హాస్పిటల్, అన్నై హాస్పిటల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ హరిశంకర్ మేఘనాథన్, ఆయన సతీమణి డాక్టర్ అపూర్వ హరిశంకర్ మేఘనాథన్‌లు సంయుక్తంగా ప్రారంభించారు. డీన్ వనిత అధ్యక్షత వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments