Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే శాఖలో ఉద్యోగ జాతర.. 9970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఠాగూర్
బుధవారం, 26 మార్చి 2025 (16:19 IST)
భారతీయ రైల్వే శాఖలో ఉద్యోగ జాతర మొదలైంది. ఏకంగా 9970 పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీఅయింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) అసిస్టెంట్ లోకో పైలెట్‌కు సంబంధించిన 9970 పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ పోస్టుల కోసం ఏప్రిల్ 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీని మే 9గా నిర్ణయించారు. 
 
దరఖాస్తు చేసుకునేవారు ఆన్‌లైన్ ద్వారా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు, ఈబీసీ అభ్యర్థులు రూ.250గా చెల్లించాల్సి ఉంటుంది. 
 
టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా గుర్తింపు పొందిన యూనవర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కనిష్ట వయసు 18 నుంచి గరిష్ట వయసు 33 యేళ్లుగా ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి ఉంది. దివ్యాంగులకు, మాజీ సైనికోద్యోగులకు పదేళ్ల అదనపు సడలింపు ఉంది. 
 
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు అన్ని అలవెన్సులతో కలుపుకుని రూ.50 వేలకు పైగానే ఉండొచ్చని ఆర్ఆర్బీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments