జేఈఈ 2025 మెయిన్స్‌ : ఎన్టీఏ కీలక ప్రకటన

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (09:22 IST)
వచ్చే విద్యాసంవత్సరం (2025-26)కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) (మెయిన్) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రటించింది. ఈ పరీక్షను రెండు సెషన్లుగా నిర్వహించనున్నట్టు పేర్కొంది. 
 
జనవరి నెలలో జేఈఈ సెషన్-1 ను, ఏప్రిల్ నెలలో సెషన్-2ను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అక్టోబరు 28 నుండి నవంబరు 22 వరకు జనవరి సెషన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ సెషన్‌కు సంబంధించి 2025 జనవరి 22 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనుంది. ఫలితాలను ఫిబ్రవరి 12వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.
 
సెషన్-2కి సంబంధించి జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 24వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ సెషన్‌కు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ఫలితాలను 2025 ఏప్రిల్ 17లోగా విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

కపుల్స్ సొసైటీ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్న కథతో సంతాన ప్రాప్తిరస్తు

Allari Naresh: 12A రైల్వే కాలనీ లో డిఫరెంట్ షేడ్స్ పాత్ర లో అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments