Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఈనెల 20న ఎన్- శాట్ పరీక్ష

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (15:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటిగా ఉన్న నారాయణ గ్రూపు విద్యా సంస్థలు చెన్నై మహానగరంలోనూ పాఠశాలలు ప్రారంభించి అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను బోధిస్తున్నారు. ఈ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన ఎన్-శాట్ పేరుతో పోటీ పరీక్షల (యాప్టిట్యూడ్ టెస్ట్) కోసం ప్రతిభా పరీక్షలను నిర్వహించనున్నారు. 
 
ఈ తరహా పరీక్షల్లో నారాయణ విద్యా సంస్థ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును పొందిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఈ సంస్థకు చెందిన విద్యార్థుల సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఈ నేపథ్యంలో 2014లో ఐఐటీ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఓ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
 
దీనివల్ల విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అత్యుత్తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రోత్సాహక బహుమతి కూడా అందజేస్తారు. ఈ నేపథ్యంలో ఈ యేడాది జనవరి 6వ తేదీన ఎన్-శాట్ పరీక్షను నిర్వహించారు. 
 
చెన్నై నగరంలో ఉన్న అన్ని నారాయణ పాఠశాల్లో ఈ పరీక్షలు జరిగింది. అలాగే, ఈనెల 20వ తేదీన మరోమారు ఈ తరహా పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల ప్రతిభాపాఠవాలు వెలికితీసేలా నిర్వహిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments