Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకింగ్ రంగంలో 25 శాతం ఉద్యోగాలు పెంపు.. పంకజ్ బన్సాల్

Webdunia
ఆదివారం, 24 మే 2015 (13:42 IST)
బ్యాంకింగ్ రంగంలో గత ఏడాదితో పోల్చితే 25 శాతం ఉద్యోగాలు ఈ ఏడాది పెరుగుతాయని పీపుల్ స్ట్రాంగ్ వ్యవస్థాపక సీఈఓ పంకజ్ బన్సాల్ వెల్లడించారు. 2014తో పోలిస్తే నాలుగోవంతు అధికమందికి ఈ సంవత్సరం ఉద్యోగాలు లభించనున్నాయని, కింది స్థాయి ఉద్యోగుల నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వరకూ నియామకాలు జరగనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
కొత్త బ్యాంకులు ప్రారంభం అవుతుండడంతో, ఉద్యోగుల సంఖ్యా పెరగనుందని వివరించారు. ఉద్యోగుల వేతనాలు కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలు, కార్పొరేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకుల్లో సైతం కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. 
 
ఐడీఎఫ్‌సీ, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు బ్యాంకులను ప్రారంభించేందుకు ఆర్బీఐ అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీస్థాయిలో కొత్త శాఖలు రానుండడం, వీటి కోసం వేలాది సంఖ్యలో నియామకాలు చేపట్టాల్సి ఉండడంతో బ్యాంకింగ్ రంగం ఉపాధి కల్పన విషయంలో మిగతా రంగాలతో పోల్చిచూస్తే ముందంజలో ఉందని పంకజ్ బన్సాల్ వివరించారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments