Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు - జారీ కానీ హాల్‌టిక్కెట్లు

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (08:58 IST)
జాతీయ ఉమ్మడి పరీక్ష (జేఈఈ) మెయిన్స్ ప్రవేశపరీక్షలు ఈ నెల 23 నుంచి 29వ తేదీల మధ్య జరుగనున్నాయి. ఈ ప్రవేశ పరీక్షల సమయం సమీపిస్తున్నప్పటికీ జాతీయ పరీక్షల నిర్వహణ (ఎన్.టి.ఏ) సంస్థ మాత్రం సోమవారం ఉదయం వరకు హాల్ టిక్కెట్లను జారీ చేయలేదు. నిజానికి ఏ ప్రవేశ పరీక్షకు అయినా వారం పది రోజుల ముందు హాల్ టిక్కెట్లను జారీచేయడం ఆనవాయితీ. కానీ, ఎన్.టి.ఏ. సంస్థ తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. 
 
దేశవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. అయినా సోమవారం ఉదయం వరకు ఈ సంస్థ హాల్‌టికెట్లు జారీ చేయలేదు. మూడు రోజుల క్రితం విద్యార్థులకు ఏ నగరం కేటాయించారో వెల్లడించినా.. పరీక్షా కేంద్రం ఏదన్నది ఇంకా తెలపలేదు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 
 
తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది ఈ పరీక్ష రాయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌టీఏను నెలకొల్పిన నాటి నుంచి పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు, ఫలితాల వెల్లడిలో విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రాలను సంప్రదించకుండా కొన్ని నెలల క్రితం జేఈఈ మెయిన్‌ తేదీలను ప్రకటించిన ఈ సంస్థ.. తర్వాత కొత్త కాలపట్టికను ప్రకటించి విమర్శల పాలైంది. 
 
ఆ సంస్థ తీరుతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహించే ఐఐటీలు కూడా పరీక్షల తేదీలను మార్చాల్చి వచ్చింది. జూన్‌ 21 నుంచి జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు మొదలవుతాయని గతంలో ప్రకటించిన ఎన్‌టీఏ.. మూడు రోజుల క్రితం ఈ నెల 23 నుంచి నిర్వహిస్తామని వెల్లడించింది. పక్కా ప్రణాళిక లేకపోవడం, రాష్ట్రాలను సంప్రదించకపోవడమే తప్పిదాలకు ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments