నిరుద్యోగులకు హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ శుభవార్త

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:59 IST)
హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నాసిక్ డివిజన్లో పలు అప్రంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 475 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 
 
ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటీస్ ట్రైనీలుగా పని చేయాల్సి ఉంటుంది. అర్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ఉపకార వేతనం చెల్లించనున్నారు. ట్రైనింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు సొంతంగానే వసతి, ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
 
ఫిట్లర్ విభాగంలో ఐటీఐ చేసిన వారి కోసం 210 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా అప్రంటీస్ పోర్టల్ www.apprenticeshipindia.orgలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారిక వెబ్ సైట్లో సూచించిన విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 13లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

మొన్ననే గోవాలో కలిశాను... ఆప్యాయంగా మాట్లాడారు : భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి

తమిళ దిగ్గజ నటుడు కె.భాగ్యరాజ్య ఎలా చనిపోయారంటే...?

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లికి వెళ్లొచ్చారు.. గుండెపోటుతో భాగ్యరాజ్ కన్నుమూత (video)

కోలీవుడ్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ హఠన్మరణం, మార్నింగ్ వాక్ చేసి వచ్చాక...

తర్వాతి కథనం
Show comments