Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐఎం క్యాట్ ఫలితాలు 2022 వెల్లడి - సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (12:39 IST)
దేశ వ్యాప్తంగా నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ 2022 పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. గత నవంబరు 27వ తేదీన ఈ పరీక్షలను నిర్వహించగా, మొత్తం 2.22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఐఐఎం బెంగుళూరు తాజాగా వెల్లడించింది. 
 
ఈ ఫలితాల్లో 11 మంది విద్యార్థులు నూటికి 100 మార్కులు సాధించగా, 22 మందికి 99.99 శాతం మార్కులు సాధించారు. నూటికి నూరు శాతం మార్కులు సాధించిన 11 మంది విద్యార్థుల్లో తెలంగాణాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉండటం గమనార్హం. అలాగే, ఢిల్లీ, మహరాష్ట్రలకు చెందిన విద్యార్థులు ఇద్దరేసి చొప్పున ఉన్నారు.
 
వీరితో పాటు హర్యానా, గుజరాత్, కేరళ, మధ్యప్రదే్శ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అయితే, టాపర్ల పేర్లను ఐఐఎం బెంగుళూరు ఇంకా వెల్లడించలేదు. దేశ వ్యాప్తంగా ఐఐఎం, పలు మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ప్రతి యేటా ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

యువతను ఆకట్టుకునేలా మ్యానిప్యూలేటర్ టైటిల్ వుందన్న బి.గోపాల్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

గోవాలో తాగిపడిపోతే సుప్రీత ఆ పని చేసింది : అమర్ దీప్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments