టీచర్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా? ఇదో గుడ్ న్యూస్

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (16:07 IST)
టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్) దేశ వ్యాప్తంగా పలు కంటోన్మెంట్లు, ఆర్మీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 8000 టీచర్ జాబ్స్ ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టింది.
 
దేశ వ్యాప్తంగా 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచే ప్రారంభమైన ధరఖాస్తుల తుది గడువు అక్టోబర్ 20వ తేదీతో ముగియనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్క్రీనింగ్ టెస్టుకు సీటెట్ లేదా టెట్ (టెట్)లో అర్హత సాధించిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి. దరఖాస్తు చివరితేదీ అక్టోబర్ 20. 
 
పీజీటీ పోస్టులు : పీజీటీ పోస్టులకు బీఈడీతో పాటు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. టీజీటీ పోస్టులు : టీజీటీ పోస్టులకు బీఈడీతో పాటు డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. పీఆర్‌టీ పోస్టులు : బీఈడీ లేదా రెండేళ్ల డిప్లొమా గానీ, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నవంబర్ 21, 22 తేదీలలో పరీక్ష నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం