Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయం ఉద్యోగాలు.. 27న అపాయింట్‌మెంట్ లెటర్స్..

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (12:43 IST)
సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చే తేదీలను ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 27న ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడగా, సెప్టెంబర్ 27న అర్హత సాధించిన వారికి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వాలని భావిస్తోంది.
 
దీనికి సంబంధించి ఏపీ మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అర్హత సాధించిన వారి పూర్తి వివరాలను జిల్లాల వారీగా కలెక్టర్లకు పంపామని, త్వరలోనే కాల్ లెటర్స్ కూడా పంపుతామన్నారు. మొదట ఓపెన్ కేటగిరీ పోస్టులు భర్తీ చేయనున్నారు.. ఆ తర్వాత రిజర్వ్‌డ్ కేటగిరీ పోస్టులను భర్తీ చేస్తారు.
 
అపాయింట్‌మెంట్ లెటర్స్ రావడానికి ముందు పాసైన అభ్యర్థులకు కాల్ లెటర్స్ వస్తాయి. ప్రభుత్వం కోరిన సర్టిఫికెట్లను వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాల్సి వుంటుంది. ఇందులో పది, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాల్సి వస్తుంది. దీంతోపాటు అభ్యర్థి పొందుపరిచిన ఈమెయిల్‌కు కూడా సమాచారం పంపుతారు.
 
కాగా సెప్టెంబరు 19న గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను జిల్లాలకు పంపించారు. ఆయా జిల్లాల్లోని కమిటీలు ఆయా వివరాలను పరిశీలించి రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం మెరిట్ జాబితాలను రూపొందించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments