Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే యేడాది నుంచి డిగ్రీలో కొత్త కోర్సులు

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:39 IST)
వచ్చే విద్యాసంవత్సరం డిగ్రీలో మరో రెండు కొత్త కోర్సులు రానున్నాయి. బీఎస్సీలో డేటాసైన్స్, బీకాంలో బిజినెస్​ అనలైటిక్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఉపాధినిచ్చే కోర్సులను ప్రవేశపెట్టేందుకు గత కొంతకాలంగా హయ్యర్ ఎడ్యుకేషన్​ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో డేటాసైన్స్ కోర్సు ఏర్పాటు కోసం కౌన్సిల్ ఛైర్మన్ పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, ఓయూ మాజీ వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్ ​రెడ్డి, ప్రొఫెసర్లు ఫాతిమా బేగం, జయశ్రీతో పాటు ఐఐఐటీ, టీసీఎస్, కాగ్నజెంట్ ప్రతినిధులతో కమిటీని వేశారు. 
 
ఆ కమిటీ సోమవారం సమావేశమైంది. వచ్చే ఏడాది బీఎస్సీ డేటాసైన్స్​ను హానర్స్​కోర్సుగా తీసుకురావాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి సిలబస్, క్రెడిట్ పాయింట్లపైనా చర్చించారు. గురుకుల విద్యాసంస్థల్లో డేటాసైన్స్​ ఆరు నెలల కోర్సుగా కొనసాగిస్తున్నారు. ఇది పూర్తిచేసిన వారిలో ఎక్కువమందికి మంచి కంపెనీల్లో జాబ్స్ వచ్చాయి. దీంతో ఈ కోర్సును డిగ్రీలో పెట్టాలని ఉన్నత విద్యామండలికి గురుకులాల సెక్రటరీ గతంలో లేఖ రాశారు. 
 
ఈ నేపథ్యంలో అప్పట్లో ఉన్నత విద్యామండలి కమిటీ వేసింది. అలాగే బీకాంలోనూ బిజినెస్​అనలైటిక్స్​కోర్సుపెట్టాలని మేనేజ్మెంట్ల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ కోర్సుపై కూడా చర్చ జరిగింది. ఇప్పటికే ఈ కోర్సు సిలబస్​ను అధికారులు సిద్ధం చేశారు. ఈ రెండు కోర్సులను ప్రభుత్వ, అటానమస్​ కాలేజీల్లోనే ప్రారంభించాలని నిర్ణయించారు. వీటితో పాటు అన్ని వసతులున్న ప్రైవేటు కాలేజీలు ముందుకొస్తే, వాటికి కూడా పర్మిషన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆయా కోర్సులు ప్రారంభించే కాలేజీల్లో సంబంధిత లెక్చరర్లకు ముందుగా ట్రైనింగ్​ఇవ్వనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments