Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేద విద్యార్థులకు శుభవార్త: ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకే..

Webdunia
శనివారం, 6 జులై 2019 (13:21 IST)
కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పేద కుటుంబంలోని పిల్లలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ప్రైవేట్ స్కూళ్లలో కూడా చదువుకునేలా చర్యలు తీసుకుంది. దేశంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు కనీసం 25 శాతం సీట్లను కేటాయించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది.
 
విద్యా హక్కు చట్ట ప్రకారం విద్య అనేది అందరి ప్రాథమిక హక్కు. ఈ హక్కు 6-14 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలందరికీ వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ నిశాంక్‌ లోక్‌సభలో మాట్లాడారు. అన్ని ప్రైవేట్‌ ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, స్పెషల్‌ కేటగిరీ స్కూళ్లలో 25 శాతం సీట్లను బడుగు, బలహీన, వెనకబడిన వర్గాల పిల్లలకు కేటాయించాల్సిందేనని స్పష్టం చేసారు.
 
ఈ పిల్లలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన లోక్‌సభలో స్పష్టం చేసారు. సంబంధిత రాష్ట్రాలు నిర్ణయించిన ఫీజుల ప్రకారమే ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందని మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ప్రకటించారు. 
 
కాగా ఈ 25 శాతం మంది చిన్నారులకు రిజర్వేషన్ ప్రకారం ఉచిత విద్య అందిస్తున్న స్కూళ్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండదని స్పష్టం చేసారు. అయితే సంబంధిత పాఠశాలలు ప్రభుత్వం నుండి భూమి, వసతి, పరికరాలు ఉచితంగా లేదా తక్కువ ధరకు పొందవచ్చని మంత్రి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments