Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోరుగా సాగుతున్న ఎంసెట్ పరీక్షా ఏర్పాట్లు

Webdunia
ఎంసెట్-2009 పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మొత్తం 749 కేంద్రాల్లో ఈనెల 14న ఎంసెట్ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంసెట్ పరీక్షకు ఈసారి 3,11,619 దరఖాస్తులు అందినట్టుగా అధికారులు తెలిపారు.

ఎంసెట్ పరీక్ష ముగిసిన తర్వాత జూన్ ఒకటిన ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఫలితాల విడుదల సందర్భంగా కేవలం మార్కులు మాత్రమే వెల్లడించనున్నారు. దీని తర్వాత జూన్ 20న జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) ర్యాంకులను ప్రకటిస్తుంది.

అటుపై ఇదే నెల 30న విద్యార్థులుకు ర్యాంకు కార్డుల పంపిణీ ప్రారంభమవుతుంది. దీని తర్వాత విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలన జరుగుతుంది. ఈ సమయంలో వెబ్ ఆధారిత విధానం కింద కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు అవసరమయ్యే పాస్‌వర్డ్‌ను విద్యార్ధులకు అందజేస్తారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 39 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments