Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రవాస విద్యార్థులకు కేంద్రంచే స్కాలర్‌షిప్‌లు

Webdunia
సోమవారం, 13 అక్టోబరు 2008 (14:09 IST)
FileFILE
విదేశాల్లో విద్యనభ్యసిస్తోన్న భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రవాస భారతీయుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా.. మొత్తం 100 మందిని ఈ స్కాలర్‌షిప్‌లకుగానూ ఎంపిక చేస్తారని, ఇప్పటిదాకా వీటికోసం 400 మంది దరఖాస్తు కూడా చేసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది.

విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల కోసం ఈ స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం వీటి కోసం ఒమన్ నుంచి 87, కువైట్ నుంచి 76, సౌదీ అరేబియా నుంచి 60, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ నుంచి 31, బహ్రెయిన్ నుంచి 27 మంది దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే... గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీలంక నుంచి కూడా ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేయడం విశేషం. కాగా, వీరందరికీ అక్టోబర్ 26వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. అధికసంఖ్యలో భారతీయులు నివసిస్తోన్న 40 దేశాలలో ఈ పరీక్ష జరుగనుంది.

పరీక్షల అనంతరం.. నవంబర్ నెలలో స్కాలర్‌షిప్‌ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని, ఆయా దేశాలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు... విద్యార్థులు సంస్థల్లో చేరే విధంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రవాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments