ప్రవాస విద్యార్థులకు కేంద్రంచే స్కాలర్‌షిప్‌లు

Webdunia
సోమవారం, 13 అక్టోబరు 2008 (14:09 IST)
FileFILE
విదేశాల్లో విద్యనభ్యసిస్తోన్న భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రవాస భారతీయుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా.. మొత్తం 100 మందిని ఈ స్కాలర్‌షిప్‌లకుగానూ ఎంపిక చేస్తారని, ఇప్పటిదాకా వీటికోసం 400 మంది దరఖాస్తు కూడా చేసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది.

విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల కోసం ఈ స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం వీటి కోసం ఒమన్ నుంచి 87, కువైట్ నుంచి 76, సౌదీ అరేబియా నుంచి 60, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ నుంచి 31, బహ్రెయిన్ నుంచి 27 మంది దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే... గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీలంక నుంచి కూడా ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేయడం విశేషం. కాగా, వీరందరికీ అక్టోబర్ 26వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. అధికసంఖ్యలో భారతీయులు నివసిస్తోన్న 40 దేశాలలో ఈ పరీక్ష జరుగనుంది.

పరీక్షల అనంతరం.. నవంబర్ నెలలో స్కాలర్‌షిప్‌ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని, ఆయా దేశాలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు... విద్యార్థులు సంస్థల్లో చేరే విధంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రవాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Show comments