Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులకు ఎగనామం.. దర్జాగా భారత్-పాక్ మ్యాచ్ చూసిన విజయ్ మాల్యా

బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని.. వాటికి ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం విదేశాల్లో బాగానే జల్సా చేస్తున్నాడు. భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వివాదాస్పద వ్యాపారవేత

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (12:01 IST)
బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని.. వాటికి ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం విదేశాల్లో బాగానే జల్సా చేస్తున్నాడు. భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వివాదాస్పద వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా అనూహ్యంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో దర్శనమిచ్చాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఈ మైదానంలో జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను అతను వీక్షించాడు.
 
ఇప్పటికే ఆర్థిక అక్రమాస్తుల కేసులలో విచారణ, అరెస్టు తప్పించుకోవడానికి మాల్యా దేశం వదలి బ్రిటన్‌ పారిపోయాడు. పలు కేసులు ఎదుర్కొంటున్న అతన్ని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. 
 
ఇటీవల అతన్ని లండన్‌ స్కాట్‌లాండ్ యార్డ్‌ పోలీసులు అరెస్టు చేసినా, వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌ను వీఐపీ స్టాండ్‌లో కూర్చుని వీక్షించిన ఫోటోలు ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్నాయి. పరారీలో ఉన్నా కూడా దర్జాగా నిర్భయంగా మాల్యా మ్యాచ్‌ చూడటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments