Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ డైరెక్టర్‌గా అనంత్ అంబానీ

Webdunia
సోమవారం, 5 జులై 2021 (18:46 IST)
Anant Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ డైరెక్టర్‌గా అనంత్ అంబానీ నియమితులయ్యారు. గ్రూప్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ.. జూన్ 24వ తేదీన నిర్వహించిన ఆర్ఐఎల్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాబోయే మూడేళ్లలో 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇంధన వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో రిలయన్స్ O2C బోర్డులో ముకేశ్, నీతా అంబానీల చిన్న కుమారుడిని నియమించారు. చిన్న వయస్సుల్లోనే డైరెక్టర్‌గా నియమితులు కావడం విశేషం.
 
ఇందులో సౌదీ అరాంకో పెట్టుబడి పెట్టనున్నారు. అనంత్ అంబానీ జియో ప్లాట్ ఫామ్స్ బోర్డులో డైరక్టర్‌గా కూడా పని చేస్తున్నారు. ఇషా, ఆకాష్ కూడా సభ్యులుగా ఉన్నారు. సోలార్‌ తయారీ కేంద్రాల నిర్మాణం, ఎనర్జీ స్టోరేజీ కోసం బ్యాటరీ కర్మాగారం ఏర్పాటు దిశగా వెళ్తున్నట్లు ప్రకటించారు. 
 
ఫ్యూయెల్‌ సెల్‌ ఉత్పాదక ప్లాంట్‌తోపాటు గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీకి ఎలక్ట్రోలైజర్‌ యూనిట్‌ను నెలకొల్పనున్నామని కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ గతంలో ప్రకటించారు. నాలుగు కర్మాగారాల్లో రూ. 60 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
 
సోలార్‌ పవర్‌ వైపు రిలయన్స్‌ దృష్టి సారించింది. 2030 నాటికి పవర్ సామర్థాన్ని సంతరించుకోవాలని చూస్తోంది. ఓ కార్బన్ ఫైబర్ ప్లాంట్ కోసం పెట్టుబడులు పెడుతామని ముకేశ్ అంబానీ వెల్లడించారు. 
 
సంస్థ ఆదాయంలో దాదాపు 60 శాతం హైడ్రోకార్బన్‌ ఆధారిత ఇంధన కార్యకలాపాల ద్వారానే సమకూరుతోంది. ఈ క్రమంలో…2035 నాటికి కార్బన్‌ రహిత సంస్థగా ఆర్‌ఐఎల్‌ (RIL) ను నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments