Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా మూతపడుతున్న ఏటీఎంలు...

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (14:34 IST)
దేశవ్యాప్తంగా ఏటీఎం కేంద్రాలు మూతపడిపోతున్నాయి. నగదు కొరతకుతోడు నిర్వహణా భారాన్ని తగ్గించేందుకు ఆయా బ్యాంకులు ఏటీఎం కేంద్రాలను మూసివేస్తున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాలు మూసివేస్తున్నాయి. గడిచిన రెండేళ్ళకాలంలో ఇప్పటివరకు 597 ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి. 
 
ఏటీఎం కేంద్రాలు మూతపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు జమ చేసే నగదు కంటే.. ఏటీఎం కేంద్రాల ద్వారా విత్‌డ్రా చేసే డబ్బు అధికంగా ఉంది. ఫలితంగా ఏటీఎం కేంద్రాల్లో నగదు కొరత సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికితోడు కొన్ని బ్యాంకులు నిర్వహణాభారాన్ని తగ్గించుకునేందుకు ఏటీఎం కేంద్రాలను మూసివేస్తున్నాయి. 
 
గత 2017లో దేశవ్యాప్తంగా 2,22,300 ఏటీఎం కేంద్రాలు ఉండగా, 2019 నాటికి వీటి సంఖ్య 2,21,703కు పడిపోయింది. నిజానికి 2012 తర్వాత బ్యాంకు ఏటీఎంలు విస్తరణ రేటును పెంచాయి. అప్పట్లో ప్రతి 10,832 మందికి ఒక ఏటీఎం అందుబాటులో ఉంటే 2017 నాటికి ప్రతీ 5,919 మంది ఖాతాదారులకు ఒక ఏటీఎం చొప్పున అందుబాటులోకి వచ్చింది. కానీ, ఐదేళ్ల కాలంలో ఏటీఎం కేంద్రాలు మూతపడటం విచిత్రంగా ఉందని భారత రిజర్వు బ్యాంకు పేర్కొంది. నిజానికి బ్యాంకు యాజమాన్యాలు ఏటీఎంల సంఖ్య పెంచాలని భావించగా, దేశ వ్యాప్తంగా ఇవి తగ్గిపోవడం విచిత్రంగా మారింది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments