Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి రూ.9,900 కోట్లు ... ఖాతాపై ఎన్.పి.ఏ నిషేధం

ఠాగూర్
ఆదివారం, 19 మే 2024 (11:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదోహీ జిల్లాలో ఓ విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఖాతాలోకి ఉన్నఫళంగా రూ.9900 కోట్లు వచ్చిపడ్డాయి. అకస్మాత్తుగా తన ఖాతాలో భారీ మొత్తం కనిపించడంతో ఓ వ్యక్తి దిమ్మెరపోయాడు. ఈ జిల్లాకు చెందిన భానుప్రకాశ్ అనే వ్యక్తికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో కిసాన్ క్రిడెట్ కార్డు లోన్ అకౌంట్ ఉంది. అయితే, బ్యాంకు దృష్టిలో ఈ అకౌంట్ ఎన్పీఏగా (నిరర్థక ఆస్తి) మారింది. 
 
ఈ క్రమంలో తలెత్తిన సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అతడి ఖాతాలోకి ఒక్కసారిగా రూ. 99,99,94,95,999.99 దర్శనమిచ్చాయి. దీంతో, షాకైన భాను ప్రకాశ్ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బ్యాంకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
 
సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా ఖాతాలోకి అంత మొత్తం కనిపించిందని భాను ప్రకాశకు మేము వివరించాం. పొరపాటు సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నాం. అకౌంట్ దుర్వినియోగం కాకుండా ముందుజాగ్రత్త చర్యగా దాన్ని హోల్డ్‌లో పెట్టాం' అని బ్యాంక్ మేనేజర్ రోహిత్ గౌతమ్ తెలిపారు.
 
'ఎన్పీఏలకు సంబంధించిన అకౌంట్లపై కొన్ని పరిమితలు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ అకౌంట్లతో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఫ్రీజ్ చేస్తాం. భాన్ ప్రకాశ్ తన అకౌంట్ చెక్ చేసినప్పుడు అది ఎన్పీఏ ఆంక్షల కారణంగా నెగెటివ్ కనిపించింది. పరిస్థితిని అతడికి వివరించి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాం" అని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం