బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు?

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (13:04 IST)
కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతి ప్రభుత్వ రంగాన్ని కొద్దికొద్దిగా ప్రైవేటుపరం చేస్తూ వస్తున్న కేంద్రం ఇపుడు దేశంలోని బ్యాంకులను ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌‍సభలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. 
 
ఇదే అంశంపై ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ, ఈ నెల రెండో తేదీ నాటికి దేశంలో వార్షిక నోట్ల చెలామణి 7.98 శాతం పెరిగి రూ.31.92 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు. నగదు చెలామణిని వీలైనంత వరకు తగ్గించడం, నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఇందులోభాగంగానే కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత రిజర్వు బ్యాంకు కూడా డిజిటల్ కరెన్సీని ప్రోత్సహిస్తుందని తెలిపారు. 
 
అలాగే, డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు విధించకుండా బ్యాంకులను ఆదేశించినట్టు ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే, గత అక్టోబరు నెలలో 7.01 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, నవంబరు నాటికి 4.67 శాతానికి పెరిగిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments