కిలో రూ.80కి పెరిగిన టమోటా ధరలు.. రైతు బజారులో ఎంత?

సెల్వి
మంగళవారం, 8 అక్టోబరు 2024 (14:40 IST)
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంగళవారం నుంచి రైతు బజార్ల ద్వారా కిలో రూ.50కి టమాటను విక్రయించనుంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు రాయలసీమ జిల్లాల నుంచి లేదా టమాటా తక్కువ ధరకు లభించే ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా విక్రయిస్తారు. 
 
టమాటా కిలో రూ.50 కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుంది. మార్కెట్‌లో టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు సచివాలయంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. 
 
ప్రస్తుతం టమాటా మార్కెట్‌లో కిలో రూ.80కి విక్రయిస్తున్నారు. చిల్లర వ్యాపారులు కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. టమాటా ధరలు పెరిగినా మార్కెట్‌లో నాణ్యమైన టమాట దొరకడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు కొంత ఊరట లభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments