Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిలో రూ.80కి పెరిగిన టమోటా ధరలు.. రైతు బజారులో ఎంత?

సెల్వి
మంగళవారం, 8 అక్టోబరు 2024 (14:40 IST)
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంగళవారం నుంచి రైతు బజార్ల ద్వారా కిలో రూ.50కి టమాటను విక్రయించనుంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు రాయలసీమ జిల్లాల నుంచి లేదా టమాటా తక్కువ ధరకు లభించే ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా విక్రయిస్తారు. 
 
టమాటా కిలో రూ.50 కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుంది. మార్కెట్‌లో టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు సచివాలయంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. 
 
ప్రస్తుతం టమాటా మార్కెట్‌లో కిలో రూ.80కి విక్రయిస్తున్నారు. చిల్లర వ్యాపారులు కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. టమాటా ధరలు పెరిగినా మార్కెట్‌లో నాణ్యమైన టమాట దొరకడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు కొంత ఊరట లభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments