Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు పెరిగిన పెట్రోల్ ధరలు - ముంబైలో రికార్డు స్థాయి ధర

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (09:44 IST)
దేశంలో ఇంధన ధరలకు ఇప్పట్లో కళ్లెం పడేలా కనిపించడం లేదు. బుధవారం కూడా మరోమారు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఫలితంగా దేశ రాజధానిలో ఈ ధరలు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి. 
 
దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.107.94, డీజిల్‌ ధర రూ.96.67కుచేరింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.113.80, డీజిల్‌ రూ.104.75, చెన్నైలో పెట్రోల్‌ రూ.104.83, డీజిల్‌ రూ.100.92, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.108.46, డీజిల్‌ రూ.99.78గా ఉన్నాయి. తాజాగా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 36 పైసలు అధికమై రూ.112.27, డీజిల్‌పై 38 పైసలు పెరిగి రూ.105.46కు చేరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments