Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో వాతకు తాక్కాలికంగా బ్రేక్ వేసిన చమురు కంపెనీలు

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (08:19 IST)
పెట్రో వాతకు కేంద్ర చమురు కంపెనీలు తాత్కాలికంగా బ్రేక్ వేశాయి. బుధవారం పెట్రో వడ్డింపును ఆపాయి. వరుసగా వారం రోజుల పాటు పెరుగుతూ వచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను బుధవారం పెంచలేదు. 
 
మంగళవారం నాటి ధరలనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో చమురు ధరలు తగ్గకపోయినప్పటికీ సగటు వేతన జీవులకు మరో 35 పైసల భారం తప్పింది. ఇప్పటికే చుక్కలనంటిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో మార్కెట్‌లో ప్రతి వస్తువు ధరలు పెరిగిపోయాయి. 
 
తాజాగా చమురు ధరలు పెరగకపోవడంతో వినియోగదారులకు కొంతలో కొంతైనా ఉపశమనం లభించినట్లయింది. మంగళవారం పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచిన విషయం తెల్సిందే. దీంతో ఇంధన ధరలు దేశవ్యాప్తంగా రికార్డుస్థాయికి చేరాయి. 
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర ఏకంగా రూ.110.04కు పెరుగగా.. డీజిల్‌ ధర రూ.98.42కి చేరింది. ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.115.85కి ఎగబాకగా.. డీజిల్‌ ధర రూ.106.62కు పెరిగింది. ఇక కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.110.49, డీజిల్‌ రూ.101.56, చెన్నైలో పెట్రోల్‌ రూ.106.66, డీజిల్‌ రూ.102.59, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.114.49, డీజిల్‌ రూ.107.40గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments