Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో వాతకు తాక్కాలికంగా బ్రేక్ వేసిన చమురు కంపెనీలు

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (08:19 IST)
పెట్రో వాతకు కేంద్ర చమురు కంపెనీలు తాత్కాలికంగా బ్రేక్ వేశాయి. బుధవారం పెట్రో వడ్డింపును ఆపాయి. వరుసగా వారం రోజుల పాటు పెరుగుతూ వచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను బుధవారం పెంచలేదు. 
 
మంగళవారం నాటి ధరలనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో చమురు ధరలు తగ్గకపోయినప్పటికీ సగటు వేతన జీవులకు మరో 35 పైసల భారం తప్పింది. ఇప్పటికే చుక్కలనంటిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో మార్కెట్‌లో ప్రతి వస్తువు ధరలు పెరిగిపోయాయి. 
 
తాజాగా చమురు ధరలు పెరగకపోవడంతో వినియోగదారులకు కొంతలో కొంతైనా ఉపశమనం లభించినట్లయింది. మంగళవారం పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచిన విషయం తెల్సిందే. దీంతో ఇంధన ధరలు దేశవ్యాప్తంగా రికార్డుస్థాయికి చేరాయి. 
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర ఏకంగా రూ.110.04కు పెరుగగా.. డీజిల్‌ ధర రూ.98.42కి చేరింది. ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.115.85కి ఎగబాకగా.. డీజిల్‌ ధర రూ.106.62కు పెరిగింది. ఇక కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.110.49, డీజిల్‌ రూ.101.56, చెన్నైలో పెట్రోల్‌ రూ.106.66, డీజిల్‌ రూ.102.59, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.114.49, డీజిల్‌ రూ.107.40గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments