Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ప్రియులకు షాక్ : పెరిగిన బంగారం ధర...

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (10:50 IST)
పండగ సీజన్‌లో పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. దేశీయ మార్కెట్‌లో పసిడి(24 క్యారెట్లు) ధర 10 గ్రాములకు.. 120 రూపాయలు పెరిగింది. అంటే.. మంగళవారం మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,330 పలుకుతుండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేట్.. రూ.44,300 వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
ఇక సిల్వర్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి రూ.67,500 పలుకుతోంది. అదేసమయంలో 10 గ్రాముల వెండి రూ.675 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.46,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,670కు చేరింది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,070 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.48,070కు చేరింది. 
 
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,330కి చేరింది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్లో పసిడి ధర రూ.44,620 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 48,680కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments