Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాష్ చెల్లించి బంగారం కొంటున్నారా? అయితే, పన్ను చెల్లించాల్సిందే

బంగారు నగల కొనుగోలుదారులపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపనుంది. క్యాష్ (నగదు) చెల్లించి బంగారం కొనుగోలు చేసే వారి నుంచి విధిగా పన్ను రాబట్టుకోనుంది. ఇందుకోసం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)‌ను

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (12:40 IST)
బంగారు నగల కొనుగోలుదారులపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపనుంది. క్యాష్ (నగదు) చెల్లించి బంగారం కొనుగోలు చేసే వారి నుంచి విధిగా పన్ను రాబట్టుకోనుంది. ఇందుకోసం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)‌ను తెరపైకి తెచ్చింది. 
 
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఈ తరహా చర్య చేపట్టింది. ఇక నుంచి రూ.2 లక్షలకు మించి బంగారాన్ని నగదుతో కొనుగోలు చేసేవారు అక్కడికక్కడే ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 
 
కొత్త ఆర్థిక సంవత్సరం (2017-18) ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. నిజానికి రూ.5 లక్షల వరకు బంగారాన్ని నగదు ఇచ్చి కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతకుమించి కొనుగోలు చేస్తేనే టీసీఎస్ చెల్లించాలి. 
 
అయితే బడ్జెట్‌లో బంగారాన్ని సాధారణ వస్తువుల జాబితాలోకి ప్రభుత్వం చేర్చింది. దీంతో ఇక నుంచి రూ.2 లక్షలకు మించి బంగారాన్ని నగదుతో కొనుగోలు చేస్తే టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై నగదుతో బంగారు కొనుగోలు చేసేముందు వెనుకాముందు ఆలోచించాల్సి ఉంటుంది.

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం