Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి నుంచి ఢిల్లీల మధ్య రెండో బుల్లెట్ ట్రైన్.. 3 గంటల్లోపే చేరుకోవచ్చు..!

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (12:01 IST)
ముంబై టు అహ్మదాబాద్ తొలి బుల్లెట్ రైలును ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. దేశంలో మరో బుల్లెట్ రైలుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఈ బుల్లెట్ రైలుని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి దేశ రాజధాని ఢిల్లీ మధ్య నడపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ న‌గ‌రాల మ‌ధ్య దూరం 782 కిలో మీట‌ర్లు కావడంతో ప్రయాణీకులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. 
 
యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచే మోడీ లోక్‌సభకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో వారణాసి-ఢిల్లీల మధ్య బుల్లెట్ రైలుని ప్రవేశపెట్టే దిశగా చర్యలు చేపట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ మార్గంలో బుల్లెట్ రైలు సాధ్యాసాధ్యాలపై స్పానిష్ కంపెనీ ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది. నవంబరు నాటికి రైల్వే శాఖకు తుది నివేదిక ఇవ్వనుందని సమాచారం.
 
ఈ బుల్లెట్ ట్రెయిన్ అందుబాటులోకి వస్తే అలీగఢ్‌, ఆగ్రా, కాన్పూర్‌, లక్నో, సుల్తానాపూర్‌ల మీదుగా దేశ రాజధానికి చేరుకుంటుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య రెండున్నర గంటల సమయం తగ్గనుంది. ప్రస్తుతం వారణాసి నుంచి ఢిల్లీకి వెళ్లాలంటే 10 నుంచి 14 గంటల సమయం పడుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments