Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల కోసం ప్రయాణ సహచరిగా స్విగ్గీ వారి ఫుడ్ ఆన్ ట్రైన్

ఐవీఆర్
మంగళవారం, 24 జూన్ 2025 (20:23 IST)
వేసవి శెలవుల సీజన్లో భారతదేశంవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ఫుడ్ ఆన్ ట్రైన్ ప్రయాణ సహచరిగా మారుతోందని భారతదేశపు ప్రముఖ ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ ఫాం స్విగ్గీ లిమిటెడ్ ప్రకటించింది. ట్రైన్ కోచ్ లోని పెద్ద సమూహానికి భారీ ఆర్డర్లు నుండి సాధారణ రైల్వే ఛార్జీలను మించిన  విభిన్నమైన క్యూజిన్స్ వరకు, విద్యార్థులు తమ ప్రయాణాలు మరింత రుచికరంగా, మరింత గుర్తుండిపోయేలా చేయడానికి స్విగ్గీని ఉపయోగిస్తున్నారు.
 
ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన పోకడలు ఇవ్వబడ్డాయి:
ఎక్కువ ఆకలితో ఉన్న ఆకలి సమూహం
మే 2025లో ఫుడ్ ఆన్ ట్రైన్ అన్వేషకులలో ప్రతి 3లో 1 విద్యార్థులుగా ఉన్నారు. ఆర్డర్ చేసిన ఆహార శ్రేణి వస్తువుల్లో సౌకర్యవంతమైన బిర్యానీ; కాంటినెంటల్, ఇటాలియన్ ఎంపికలైన బర్గర్లు, పనీర్ టిక్కా క్యుసడిల్లా, స్పఘెట్టి అజిలియో ఓలియో; అరబిక్, మెడిటరేనియన్ ఆహారం, వేగన్ ఆహారం, మరియు కింగ్ ఫిష్ తవా ఫ్రై మరియు చికెన్ కషా భునా వంటి సముద్ర ఆహారపు రుచులు ఉన్నాయి.
 
సౌకర్యవంతమైన ఆహారాన్ని కలిసిన ఆరోగ్యవంతమైన ఎంపికలు
ఈ వేసవిలో, స్విగ్గీ వారి ఫుడ్ ఆన్ ట్రైన్ సేవలు ఉపయోగించే విద్యార్థులు సీరియస్ ఆకలి కోరికలను తెలివైన ఎంపికలతో మిశ్రమం చేసారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించే వారు సంపూర్ణ బౌల్స్, ఇంటి భోజనాలు కోసం ద గుడ్ బౌల్ మరియు లంచ్ బాక్స్ లను ఎంచుకున్నారు.
 
సౌకర్యవంతమైన ఆహారం పట్ల ఇష్టం చూపించే వారు మెక్ డొనాల్డ్స్, KFC, సబ్ వే, పిజ్జా హట్, ఎల్లప్పుడూ వారు కొనుగోలు చేసే ఇతర నమ్మకమైన, ప్రసిద్ధి చెందిన, ఎల్లప్పుడు విశ్వసించదగిన, వేగవంతమైన ఆహారాలను ఎంచుకున్నారు. వివిధ రకాలు ఇష్టపడే వారు హల్దీరామ్స్‌ను ఎంచుకున్నారు.
 
ప్రతి ఒక్కరి కోసం ఒక విద్యార్థి ఆర్డర్ చేసినప్పుడు
రైలు స్నేహానికి ఉదాహరణగా, భోపాల్ జంక్షన్ లోని ఒక విద్యార్థి గోండ్వానా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో 30 థాలీస్ కు ఆర్డర్ ఇచ్చి  కేవలం ఒక భోజనం కోసం కాకుండా మొత్తం అందరూ కలిసి ప్రయాణిస్తున్న సమూహం కోసం రూ. 6,070 ఖర్చు చేసాడు. అది చాలామంది కోసం చేసిన ఒక్క ఆర్డర్ మాత్రమే.
 
అభిమాన స్టేషన్‌గా నిలిచిన నాగపూర్ 
భారతదేశంలో భౌగోళికంగా నాగ్ పూర్ వ్యూహాత్మకంగా ఉంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కొల్ కత్తా వంటి నగరాలకు/వెళ్లే విద్యార్థుల రైలు ప్రయాణాల్లో ఎక్కువ భాగం తరచుగా ఇక్కడే ఆగుతాయి లేదా ఇక్కడ నుండి  వెళ్తాయి. స్విగ్గీ నుండి రుచికరమైన, తాజా ఆహారం ఆర్డర్ చేయడానికి విద్యార్థుల కోసం ప్రాధాన్యతనిచ్చిన ప్రదేశంగా నాగరూపర్ అభివృద్ధి చెందింది. తదుపరి గమ్యస్థానానికి రైలు వెళ్లడానికి ముందు వారి సీట్ కి డెలివరీ చేయబడుతుంది.
 
నాయకత్వంవహించిన ఇంజనీరింగ్ కాలేజీలు
ఇంజనీరింగ్ విద్యార్థులు జాబితాలో ప్రధమ స్థానంలో ఉన్నారు. ఫుడ్ ఆన్ ట్రైన్స్‌లో సుమారు 70% విద్యార్థుల నుండే ఆర్డర్లు వస్తాయి. దీనిలో IIT ఖరగ్ పూర్, IIT BHU వారణాశి, వేలూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి కీలకమైన సంస్థలు చేర్చబడ్డాయి.
 
విద్యార్థులకు విందుల స్వేచ్ఛను ఇచ్చిన పే-లేటర్ ఎంపికలు
బై నౌ పే లేటర్ (BNPL) కోసం చాలామంది విద్యార్థులు ఎంచుకున్నారు. ఇతర క్రెడిట్ ఎంపికలను కూడా చేర్చినప్పుడు ఈ విద్యార్థుల సంఖ్య పెరిగింది. తక్షణ సంతృప్తి ఇంతకంటే మెరుగ్గా ఎన్నడూ ఉండబోదు!
 
ఉదయం వేళ కలిగే ఆకలి నుండి డిన్నర్ తరువాత తినే చిరుతిండ్ల వరకు
రైళ్లల్లో ఆర్డర్ చేసే సమయంలో విద్యార్థులు గడియారాన్ని అనుసరించరు. అది ఉదయం వేళ 7 గంటల బ్రేక్ ఫాస్ట్ కావచ్చు లేదా రాత్రి 9:45 డిన్నర్ కావచ్చు, తదుపరి రాత్రి 11 గంటలకి మిఠాయి కావచ్చు, విద్యార్థులు ఒక దాని తరువాత మరొకటి ఆర్డర్లు ఇస్తూనే ఉంటారు. 5 మంది విద్యార్థుల్లో 1 విద్యార్థి అదే ప్రయాణంలో తరచుగా ఒక స్టేషన్ లో డిన్నర్ తదుపరి మరొక స్టేషన్ లో డిజర్ట్ లేదా మిఠాయి కోసం మొత్తంగా కనీసం రెండు ఆర్డర్లు ఇస్తారు.
 
ఈ కార్యక్రమం గురించి వ్యాఖ్యానిస్తూ, శ్రీ. దీపక్ మలూ, వైస్ ప్రెసిడెంట్, ఫుడ్ స్ట్రాటజీ, కస్టమర్ ఎక్స్ పీరియెన్స్ & న్యూ ఇనీషియేటివ్స్, స్విగ్గీ ఇలా అన్నారు, “విద్యార్థులు స్విగ్గీ వారి ఫుడ్ ఆన్ ట్రైన్ సేవలు ఎంతగానో ఇష్టపడ్డారు! వివిధ క్యూజిన్స్ నుండి అర్థరాత్రి స్నాక్స్ వరకు వాళ్లు ప్రతిది ఆర్డర్ చేస్తున్నారు మరియు తుదకు పెద్ద సమూహాల కోసం కూడా ఆర్డర్ చేస్తున్నారు. విద్యార్థుల నుండి వచ్చిన ఈ భారీ డిమాండ్ ఆన్ బోర్డ్ డైనింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడైనా తమ ప్రయాణంలో  కోరుకునే భోజనాలను అందచేయడానికి  స్విగ్గీకి ప్రేరణనిస్తోంది.”

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments